అరకు ఎమ్మెల్యే కిడారి దారుణ హత్య
మాజీ ఎమ్మెల్యే సోమనూ చంపేశారు
చర్చిద్దామన్నా చలించలేదు
ఆరు రౌండ్లు పేల్చి ఘాతుకం
విశాఖ జిల్లా లివిటిపుట్టు వద్ద కిరాతకం
కాపుకాసిన 60 మంది మావోయిస్టులు
వారిలో 30 మంది మహిళలే
నేతల క్వారీల తవ్వకంపై ఆగ్రహం
ఎమ్మెల్యే మృతితో అభిమానుల ఆందోళన
రెండు పోలీసు ఠాణాలకు నిప్పు

అరవై మంది సాయుధ మావోయిస్టులు... సగంమంది పాతికేళ్ల లోపువారే... వీరందరికీ ఓ మహిళ నాయకత్వం... చేత చిక్కిన ఇద్దరు ప్రజాప్రతినిధుల్ని ఆమె ‘మీ ఖేల్ ఖతం’ అనగానే సాయుధులు కాల్చేశారు.. రక్తపు మడుగులో అచేతనంగా ఉన్న వారిపై కసిగా మరో రెండు రౌండ్లు పేల్చారు.. ప్రశాంత విశాఖ మన్యంలో దాడి చేసి... ఏపీలో కలకలం సృష్టించారు.


ముందుగా ప్రభుత్వ విప్ కిడారి సర్వేశ్వరరావు వాహనం నుంచి కిందకు దిగిన వెంటనే చేతులను వెనక్కి కట్టేశారు. వెనుక వాహనంలో ఉన్న సివేరి సోమను కిందకు దించి, ‘ఇటీవల ఒడిశాలోని గొల్లూరి వద్ద జరిగిన ఎన్కౌంటర్కు సంబంధించి నువ్వే పోలీసులకు సమాచారం ఇచ్చావంటా’ అంటూ గద్దించారు. మావోయిస్టుల బృందానికి నాయకురాలిగా భావిస్తున్న ఓ 38ఏళ్ల మహిళ గట్టిగా తెలంగాణ యాసలో మాట్లాడింది. ఎమ్మెల్యే కిడారి హుకుంపేట మండలంలోని గూడ క్వారీ వల్ల ప్రజలు ఇబ్బందులు పడుతున్నా పట్టించుకోకుండా ధన దాహంతో వెంపర్లాడుతున్నాడని ఆమె మండిపడింది. పార్టీలు మారి అధికారంలోకి వచ్చాక బాక్సైట్ని తవ్విస్తూ గిరిజన ద్రోహులుగా మారారని నిందించింది. మాజీ ఎమ్మెల్యే సోమ ఒడిశా సరిహద్దుల్లోని గొల్లోరి వద్ద గతేడాది మావోయిస్టుల శిబిరంపై పోలీసులు జరిపిన కాల్పులకు కారణమని, కాల్పుల్లో తాము త్రుటిలో తప్పించుకున్నామని, తమని చంపించేందుకు పోలీసులతో చేతులు కలిపిన సోమ ద్రోహి అని ఆవేశపూరితంగా చెప్పింది. సుమారు 15 నిమిషాలు ఆమె మాట్లాడింది. ఆయుధాలతో చుట్టుముట్టేసి కాల్చేయడానికి సిద్ధమవుతున్న సమయంలో ‘ఆయుధాలతో వద్దు.. మాట్లాడుకుని పరిష్కరించుకుందామ’ని ఆ మహిళా మావోయిస్టును ఎమ్మెల్యే కిడారి బతిమలాడారు. ఎమ్మెల్యే మావోయిస్టులతో మాట్లాడుతుండగానే ‘మీ ఖేల్ఖతం’ అని మహిళా మావోయిస్టు అరిచింది. వెంటనే మాజీ ఎమ్మెల్యే సివేరి సోమా దగ్గర ఉన్న మావోయిస్టులు ఆయనపై రెండు రౌండ్లు కాల్పులు జరిపారు. ఆయన అక్కడికక్కడే చనిపోయారు. ఎమ్మెల్యే కిడారి కాల్పులు వద్దని వేడుకుంటుండగానే ఆయనపైనా రెండు రౌండ్లు కాల్పుల జరిపారు. ఇద్దరు నేతలూ రక్తమడుగులో నేలకొరిగిన తరువాత ఓ యువతి వారి దగ్గరకు వచ్చి... మరో రెండు రౌండ్లు కిడారిపై కాల్పులు జరిపింది. ‘చనిపోయాడు కదా, ఇంకెందుకు బుల్లెట్లు వృథా చేస్తావ’ంటూ ప్రధాన మహిళా మావోయిస్టు ఆ యువతిని వారించినట్లు తెలిసింది.

ఎమ్మెల్యే కిడారిపై గత కొంత కాలంగా మావోయిస్టులు నిఘా పెట్టారు. క్వారీలు, గిరిజనుల భూముల వ్యవహారాల్లో స్థానికులకు అన్యాయం చేస్తున్నారని ఇదివరకే హెచ్చరికలు జారీచేశారు. వీటిపై ప్రజాప్రతినిధులు అప్రమత్తంగానే ఉన్నా ఇటీవల పార్టీ వ్యవహారాల్లో జోరు పెంచారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో గ్రామాలన్నీ చుట్టిరావాలని భావించారు. ఈ సమాచారం తెలుసుకున్న మావోయిస్టులు పక్కా ప్రణాళికతో దాడికి దిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కూడా ఉదాసీనంగా వ్యవహరించడం వారికి కలిసొచ్చింది. అందుకే మారుమూల గ్రామాల్లో కాకుండా మండల కేంద్రానికి కూతవేటు దూరంలో నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే హత్యకు దిగారు. ఒడిశా సరిహద్దుకు 15 కిలోమీటర్ల దూరంలో ఈ కాల్పులు జరిపారు.
ప్రత్యక్ష సాక్షుల కథనం ![]() ![]()
స్వామి, మాజీ ఎమ్మెల్యే సోమ గన్మెన్
అప్పారావు, ఎమ్మెల్యే కిడారి వ్యక్తిగత సహాయకుడు |

రా కిడారి చివరి మాట అదే
- రవి, ఎమ్మెల్యే కారు డ్రైవరు
|



0 Comments